Skip to main content

FOR MORE UPDATES CLICK & FOLLOW

(1) YOUTUBE - FOLLOW           (2) FACEBOOK PAGE -FOLLOW         (3) INSTAGRAM -FOLLOW    (4) FACEBOOK GROUP -FOLLOW

జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చీరాల MLA కరణం బలరామ్ గారికి వినతి పత్రం. chiralamedia

#karanambalaramkrishnamurthy #karanamvenkatesh జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారికి వినతి పత్రం అందజేసిన వేటపాలెం యడ్లబండ్లు యజమానుల సంఘం చీరాల: వేటపాలెం మండలం యడ్లబండ్లుయజమానులు బుధవారం ఉదయం చీరాల పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. వేటపాలెం మండలంలో సుమారు 110 కుటుంబాలు యడ్లబండ్లు మీద జీవనాధారంగా జీవిస్తున్నాయనీ,చీరాల ప్రాంతంలో అపారమైన ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇసుక రీచ్ అనుమతులు లేని కారణంగా యడ్లబండ్లు యజమానులు జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి యడ్లబండ్లు ను ఇసుక రవాణాకు మినహాయించిన నిర్ణయాన్ని చీరాల నియోజకవర్గంలో అమలు చేయడానికి పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఇసుక రవాణాకు యడ్లబండ్లను మినహాయించడం గత సంవత్సరం ఎమ్మెల్యే బలరాం మాకు జీవనాధారాన్ని కల్పించారని,

అయితే, చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయమై ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు యడ్లబండ్లు యజమానులను అదుపులోకి తీసుకొని ఫెనాల్టీలు విధించడం ద్వారా మాపై ఆదాయానికి మించి భారం పడటం తో మా కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయనీ వారు ఎమ్మెల్యే బలరాం వద్ద వాపోయారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎడ్లబండ్లు యజమానుల లో ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తుంటే సదరు విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రభుత్వ అధికారులకు మా వంతు సహకారాన్ని అందించడానికి యడ్లబండ్లు యజమానుల సంఘం కృషి చేస్తుందని, సంఘం నాయకులు ఎమ్మెల్యే కి తెలిపారు. వేటపాలెం మండల పరిధిలోని పోలీస్, రెవెన్యూ అధికారులతో మా సమస్యను చర్చించి మాకు జీవనాధారం కల్పించవలసిందిగా యడ్లబండ్లు యజమానులు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ, వీలైనంత త్వరగా సంబంధిత అధికారులతో మరియు ఎడ్లబండ్ల యజమానులతో సంయుక్త సమావేశం నిర్వహించి మంచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో యడ్లబండ్లు యజమానులు కుంభా వీరయ్య, ఆతిన వెంకట్రావు, అక్కల కృష్ణారెడ్డి, తమ్మినేని నవీన్ కుమార్, భూపతి వెంకట్రావు, చింతా బాబురావు, బట్టు పెద్ద మస్తాన్, ఓరుగంటి రెడ్డి యువజన సంఘం నాయకులు దుడ్ల రాజేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

Comments

Popular posts from this blog

FACEBOOK VIDEO CLICK

అడుగు అడుగునా స్ఫూర్తి నింపేటి వో ధైర్యమా. బడుగు జీవుల పాలి దయగల దైవమా. బాట నువ్వు, బతుకు నువ్వు. మీ సాటి ఎవరన్నా. త్యాగం నువ్వు, తెగింపు నువ్వు. జననేత అన్న. #KaranamVenkatesh #karanambalaramkrishnamurthy #KaranamBalaram #kaRanAm #karanamchirala #chiralamedia #KaranamBalaram CLICK BELOW LINK TO WATCH:   https://www.facebook.com/100074640160528/videos/466936905098421/ https://www.facebook.com/100074640160528/videos/466936905098421/

చీరాలలో కరణం వెంకటేష్ కి గ్రీన్ సిగ్నల్

CHIRALA MEDIA News కీలకమైన వచ్చే ఎన్నికల్లో వారసులను పక్కనపెట్టి సీనియర్ల రంగంలో ఉండాలని చెప్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు మాత్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తండ్రికి వారసుడిగా వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ పోటీ చేసేందుకు అంగీకరించారు. చీరాల రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని వారికి సూచించినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి తోపాటు ఎమ్మెల్యే బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని నివాసంలో తొలుత. సీఎంను బాలినేని కలిశారు. వారిద్దరి చర్చల అనంతరం బలరాం, వెంకటేష్ ను పిలిచి మాట్లాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ను పోటీకి దించేందుకు అంగీకరించాలని, చీరాల నుంచే అవకాశం ఇవ్వాలని బలరాం సీఎంను కోరినట్లు తెలిసింది. బలరాం వారసుడిగా వెంకటేష్ కొన సాగేందుకు అంగీకరించిన సీఎం.. చీరాలలో యాక్టివ్ గా పనిచేయండి. అని మాత్రం చెప్పినట్లు తెలిసింది. ఇది సాను కూల పరిణామంగా బలరాం ఆనుచర వైసీపీ: శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే చీరాల కాని పక్షంలో బలరాం ల...

మండల పరిషత్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ. | #Chiralamedia || #karanamvenkatesh #karanambalaram #apnews ||

  మండల పరిషత్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ. | #Chiralamedia || #karanamvenkatesh #karanambalaram #apnews || చీరాల మండలం పల్లయ్య పాలెం గ్రామ మండల పరిషత్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన... స్థానిక గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కరణం బలరాం కృష్ణ మూర్తి గారు.... కార్యక్రమంలో ఆయన వెంట మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు గారు స్థానిక నాయకులు పాల్గొన్నారు

TOTAL VISITED IN THIS SITE

Followers